Chandrababu | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. గురువారం ఉదయం తీర్పు వెల్లడించనున్నట్టు తెలిపింది.
విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్లపై మూడు గంటలకుపైగా వాదనలు జరిగాయి. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి.. గురువారం తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొన్నది.