హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దూరప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా మల్టి సిటీ జర్నీ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీంతో రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకే టికెట్ జారీ చేసే విధానం అమలులోకి వచ్చింది. వెళ్లాల్సిన ప్రాంతానికి నేరుగా బస్సు సదుపాయం లేనప్పుడు, ఒక టికెట్తో రెండు బస్సుల్లో ప్రయా ణం చేసి గమ్యస్థానం చేరుకోవచ్చు. మార్గమధ్యంలో ప్రధాన బస్టాండ్లో దిగి అక్కడ మరో బస్సు ఎక్కి గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
రెండు బస్సుల్లో ప్రయాణానికి ఒకేసారి ముందస్తుగా ఆర్టీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. రాయితీలు యథాతథంగా వర్తిస్తాయని, ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు. తొలి బస్సు నుంచి దిగిన తర్వాత 2 నుంచి 22 గంటల వ్యవధిలో రెండో బస్సు ఎక్కి ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. తొలి దశలో 137 దూర ప్రాంత బస్సు రూట్లలో ఈ విధానం అమలు చేస్తున్నట్టు తెలిపారు.