అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫస్టియర్ 2022-23గాను ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్టు సెక్రటరీ శేషగిరి బాబు విడుదల చేశారు. రేపటి నుంచి (20) నుంచి ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని సెక్రటరీ వెల్లడించారు. జులై 20నాటికి మొదటి విడత ప్రవేశాలు ముగుస్తాయని వివరించారు. ఇంటర్లో ప్రవేశాలు పదోతరగతి మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు.
రెండో విడతలో మిగిలిన సీట్లను జనరల్గా మార్చి ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థుల చొప్పున సీట్లు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఒకేషనల్, పారామెడికల్ కోర్సులకు మాత్రం ఒక సెక్షన్కు 20 మందిని కేటాయిస్తామన్నారు. ప్రతి కళాశాల ఆవరణంలో మొత్తం సీట్లు, భర్తీ అయినవి, మిగిలిన సీట్లకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచుతామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటీవ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. జులై ఒకటి నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.