AP MLC Elections | ఆంధప్రదేశ్లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏడు స్థానాలకు జరిగిన పోటీలో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. ఆమెకు 23 ఓట్లు లభించాయి. రెండో ప్రాధాన్య ఓటుతో వైసీపీ అభ్యర్థి జయ మంగళ వెంకట రమణ గట్టెక్కారు.
అధికార వైసీపీ నుంచి పోతుల సునీత, మర్రి రాజశేఖర్, ఏసురత్నం, ఇజ్రాయెల్, పెనుమత్స సూర్యనారాయణ రాజు గెలుపొందారు. వైసీపీ తరపున పోటీ చేసిన కోల గురువులు ఓటమి పాలయ్యారు.
అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలవడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో జోష్ కనిపిస్తున్నది. టీడీపీ కార్యాలయంలో నేతలు స్వీట్లు పంచుకున్నారు. ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్పై ఇరు పార్టీలో చర్చ సాగుతున్నది.