రాయలసీమ యూనివర్శిటీ ఉపకులపతి ఆనందరావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించింది. ఆనంద రావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఏపీ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ దిశగా విద్యార్థి సంఘాలు కదులుతున్న సమయంలో విజయవాడలోని ధర్నాచౌక్ వద్ద విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటతో ఘర్షణ జరిగింది.
వీసీ ఆనందరావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీనిని నిరసిస్తూ రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఈ ముట్టడికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 153 మంది విద్యార్థులను పరీక్షలకు అనుమతించకుండా వీసీ ఆనందరావు వేధించారని విద్యార్థులు ఆరోపించారు.