అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో చోటు చేసుకుంది. సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడలను గురువారం ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను మరింత ఉత్సహ పరిచేందుకు స్పీకర్ కబడ్డీ ఆడే క్రమంలో అదుపు తప్పడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. స్థానిక అనుచరులు స్పీకర్ను వెంటనే పైకి లేపారు.