అమరావతి: రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను క్షేమంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్కు సమీపంలో ఉండే ప్రాంతాలైన రొమేనియా, హంగరీలకు ఏపీ ప్రతినిధులను పంపి అక్కడి నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు గాను ప్రతినిధులను అక్కడికి పంపేందుకు ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఉక్రెయిన్లో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో పొరుగున ఉన్న రొమేనియా, హంగరీలకు విద్యార్థులను తరలించి ఏపీకి చెందిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు. తెలియక అయోమయానికి గురైన ప్రభుత్వం చివరకు భారత్లోని ఉక్రెయిన్ ఎంబసీ నుంచి వివరాలు సేకరించారు. సుమారు 680 మంది విద్యార్థులు న్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల వివరాల జాబితాను విదేశాంగ శాఖకు అందజేసింది.
దీంతో పాటుగా విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల వివరాలు రాబట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారు లు, తహసీల్దార్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి కొంతమంది విద్యార్థులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోగా స్వదేశానికి రావడానికి అనేక అవస్థలు పడుతున్న ఏపీ విద్యార్థుల ఆచూకి కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది.