అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (AP Polycet) ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి ఫలితాలను బుధవారం విడుదల చేశారు. 74,884 మంది విద్యార్థులు ఈ సంవత్సరం పాలిసెట్కు దరఖాస్తు చేయగా.. ఇందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. 64,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కె రోషన్లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్వర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. వీరిద్దరికీ 120 మార్కుల చొప్పున రావడం విశేషం.