అమరావతి,జూన్ 15: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో టెన్త్ ,ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చే నెల నిర్వహించాలని జగన్ సర్కారు భావిస్తున్నది. ఇదే అంశంపై ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ స్పందించారు. జులై మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, జూలై చివరి వారంలో పదోతరగతి పరీక్షలు ఉండే అవకాశం ఉందని ప్రకటించారు. దేశంలోనూ,ఏపీలోను కరోనా తగ్గుముఖం పడుతున్ననేపథ్యంలో ఇంటర్ పరీక్షల నిర్వాహణకు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం జగన్ సమీక్ష తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ క్లారిటీ ఇచ్చారు.