అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారుల(IAS Officers)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్వర్వులను జారీ చేశారు. ఆయుష్ కమిషర్గా ఎస్బీఆర్ కుమార్ను, ఢిల్లీ ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా హిమాన్షు కౌషిక్ను , గ్రామాల సర్వే, మ్యాపింగ్ కార్యక్రమం స్పెషల్ కమిషనర్గా ఏ సిరిని నియమించారు.
బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా జి క్రైస్ట్ కిషోర్ కుమార్ను నియమించారు. కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్గా భరత్ తేజ, ఇన్సురెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా వి ఆంజనేయులును బదిలీ చేస్తూ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.