అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్లు ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పటించింది వీరిద్దరేనని విమర్శించారు. ముందుగా లోకేశ్ తన తండ్రి చంద్రబాబు, తాత ఖర్జూరనాయుడు పూర్వ చరిత్రలు తెలుసుకుని మాట్లాడా లని సూచించారు. ఏనాడు ప్రజలచే గెలవని లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని తెలిపారు.
చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో ఏపీ ప్రజలందరికి తెలుసని పేర్కొన్నారు. ఏపీలో ఆంధ్ర సహకార సంఘాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. మరో మంత్రి మేరుగు నాగార్జున లోకేశ్పై విరుచు కు పడ్డారు. లోకేశ్ నోటి వెంట బూతు మాటలు వస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అంశంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ పరిపాలనలో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసుకునే అధికారం వైఎస్ జగన్ కు ఉందని స్పష్టం చేశారు.