అమరావతి : ఏపీ మంత్రి రోజా (Roja) నటుడు చిరంజీవిపై ఫైర్ అయ్యారు. సలహాలు తమ్ముడు పవన్కు ఇచ్చుకోవాలని, ప్రభుత్వానికి కాదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి (Chiranjeevi) చేసిన కామెంట్లకు ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్నవారు ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రోడ్లు నిర్మించాలని చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమ మీద పడడం మానుకోవాలని చిరంజీవి సూచించారు.
వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల సందర్భంగా ఏర్పాటుచేసిన విజయోత్సవ కార్యక్రమంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చిరంజీవి వ్యాఖ్యలను ఖండిస్తూ విరుచుకుపడ్డారు. తాజాగా తిరుపతిలో మంత్రి రోజా చిరంజీవి కామెంట్లపై స్పందించారు. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే బదులు తమ్ముడు పవన్కల్యాన్ (Pawan Kalyan) కు సలహాలు ఇవ్వాలని కౌంటర్(Counter) ఇచ్చారు.
సినిమా వేదికలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రిగా లబ్ధిపొందిన చిరంజీవి రాష్ట్రానికి చేసింది శూన్యమని అన్నారు. సినిమా వాళ్లు చెప్తే వినే స్థాయిలో ప్రభుత్వం లేదని వెల్లడించారు.