ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అన్న పదం వాడి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదంలో ఇరుక్కుపోయారు. టెన్త్ పేపర్ లీకేజీ నిందితులను తాము ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుకున్నామని పెద్దిరెడ్డి ప్రకటించారు. దీంతో టీడీపీ ఫైర్ అయ్యింది. ఫోన్ ట్యాపింగ్ నేరమని ప్రభుత్వానికి తెలియదా? అంటూ ఒక్క సారిగా వైసీపీని తూర్పూరా పట్టింది.
దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అలర్ట్ అయ్యారు. తాజాగా.. ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాము ఫోన్ ట్యాపింగ్ అని అనలేదని, ఫోన్ ట్రాకింగ్ అని అన్నానని వివరణలో పేర్కొన్నారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో 60 మంది నిందితులను అరెస్ట్ చేశామని, ఎవరు ఎవరితో మాట్లాడారన్నది విషయంలో ఫోన్లను ట్రాక్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వివరణ ఇచ్చారు.