టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్పై ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భగ్గుమన్నారు. వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా సీఎం జగన్కు ప్రశ్నలు సంధిస్తున్నారని దెప్పి పొడిచారు. లోకేశ్ ఏమైనా హరితవిప్లవ పితామహుడా? లేక వ్యవసాయ రంగ నిపుణుడా? అంటూ నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అయినంత మాత్రాన లోకేశ్ ఏదిపడితే అది మాట్లాడటమేనా? అంటూ ఫైర్ అయ్యారు.
రైతు, కౌలు రైతుకు మధ్య తేడా ఏమిటో లోకేశ్కు తెలుసా? అంటూ మంత్రి కాకాణి ప్రశ్నించారు. అసని తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు కచ్చితంగా నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. తుపానుకు సంబంధించిన నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు అధికారులను కూడా పురమాయించామని మంత్రి తెలిపారు.