అమరావతి: దుబాయ్ లోని పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించింది. డీపీ వరల్డ్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పర్యటించారు. అన్ని రకాల ఎగుమతులకు సంబంధించిన ప్రఖ్యాత కంపెనీలు జెబెలి అలీ పోర్టు ప్రత్యేకతలను మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు.
10 లక్షల కార్లను స్టోరేజ్ చేసే సామర్థ్యం ఉన్న పోర్టు ఎగుమతులని, ఎలక్ట్రిక్, లాజిస్టిక్ , మానుఫాక్చరింగ్, షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లను ఆసక్తిగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు డీపీ వరల్డ్ ఆసక్తి కనబరిచింది. జెబెలి అలీ పోర్టులో కార్యకలాపాలను పరిశీలించే విధంగా 40వేల సీసీ కెమెరాలున్నట్లు మంత్రికి డీపీవరల్డ్ మేనేజర్ అహ్మద్ వివరించారు.
మల్టీ పార్కింగ్ స్టోరేజ్ సహా అలీ పోర్టులో అనేక ప్రత్యేకతలని, ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల నిర్వహణకు ఏ విధంగా వినియోగించుకోవచ్చనే కోణంలో పోర్టు పర్యటన సాగింది. అనంతరం డీపీ వరల్డ్ పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యంతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. ఏపీలో మౌలిక వసతుల గురించి డీపీ వరల్డ్ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఆ ముందు రోజు మంత్రి మేకపాటి తో తాజ్ బే హోటల్ లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో సమావేశం సందర్భంగా ఆ సంస్థ సీఈఓ యువరాజ్ నారాయణ్ తో పలు అంశాలపై చర్చల కొనసాగాయి.
అనంతరం అబుదాబీలోని ఉక్కు రంగానికి చెందిన కొనరస్ కంపెనీని మంత్రి విజిట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కడపజిల్లాలో ఏర్పాటు చేస్తోన్న స్టీల్ ప్లాంట్ గురించి మంత్రి కొనరస్ ప్రతినిధులకు వివరించారు. గ్యాస్ సహా ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ప్రధానంగా చర్చించారు.