అమరావతి : చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె విజయవాడలో ‘వసంతం’ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న చేనేత వస్త్రాలు, కళాఖండాలు, హస్తకళలు కొలువుదీరాయి. ఈ సందర్భంగా మంత్రి ఎగ్జిబిషన్లోని ప్రతి స్టాల్ను సందర్శించారు.” మన చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పెట్టే చీరలను నేయగలరని” ఆమె అన్నారు.
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.