అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Devolopment Scam) చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్లను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో తొలుత చంద్రబాబు పేరు లేదని, తర్వాత ఆయన పేరును చేర్చారని, గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. తనపై కేసు, రిమాండ్ రిపోర్ట్ చెల్లుబాటు కాదని వాదించారు. సుదీర్ఘ విచారణ అనంతరం అన్ని ఆధారాలు ఉన్నందునే చంద్రబాబును అరెస్ట్ చేశామని ఏసీబీ తెలిపింది.
ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదులు సిద్ధార్ధ లూధ్రా, హరీష్ సాల్వేలు వాదనలు వినిపించగా ఏసీబీ, ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.
Read More :