అమరావతి : రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) మధ్యంతర ఉత్వర్వులు(Interim orders) జారీ చేసింది. రేపటి వరకు సినిమాను నిలిపివేయాలని హైకోర్టు ఆదే శాలిచ్చింది. సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని, సెన్సార్ బోర్టు జారీ చేసిన ధ్రువ పత్రాన్ని చేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వైకాపాను చులకన చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు పై విధంగా స్పందించింది.