తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ (Abdul Nazir) మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు ఆలయ మర్యాదలతో టీటీడీ(TTD ) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి. ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా చైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో నందకిషోర్ అధికారులు పాల్గొన్నారు.