Rushikonda | వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన రుషికొండ ప్యాలెస్లను ఎలా వినియోగిస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వాలని ఏపీ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కోరింది. ఈ మేరకు ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి వివరాలు వెల్లడించారు.
రుషికొండ భవనాల వినియోగంపై ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలను rushikonda@aptdc.inకు మెయిల్ చేయాలని ఆమ్రపాలి సూచించారు. ఈ నెల 17వ తేదీన జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నామని ఆమ్రపాలి తెలిపారు. ఆయా సంస్థలు కూడా సూచనలు చేయవచ్చన్నారు. ప్రజలు, సంస్థలు చేసిన సూచనలపై మంత్రుల బృందం సమీక్షిస్తారని.. ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.