AP News | సంక్రాంతి సెలవుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఉద్యోగులకు మరో రోజు కూడా హాలీడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
2025 ప్రభుత్వ సెలవుల్లో ఏపీ ప్రభుత్వరంగ బ్యాంకులకు జనవరి 14వ తేదీ మాత్రమే సంక్రాంతి సెలవుగా ప్రకటించారు. కనుమ రోజు అంటే బుధవారం నాడు బ్యాంకులను యథావిధిగా తెరవాల్సి ఉంటుంది. దీంతో కనుమ నాడు( ఈ నెల 15న) కూడా సెలవు ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనియన్ కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ సర్కార్.. బ్యాంకులకు అదనంగా మరో రోజు కూడా సెలవును పొడిగించింది.
తాజా నిర్ణయం ప్రకారం గతేడాది డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నెంబర్ 2116కు సవరణలు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు జీవో నెం.73ను విడుదల చేసింది.