ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులు సోమవారం సింహాచల నృసింహ స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం పర్యటనకు వచ్చిన గవర్నర్ దంపతులకు దేవస్థానం అధికారులు, మంత్రి అవంతి శ్రీనివాస్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఉన్న కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.
అంతరాలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ వేద పండితులు గవర్నర్ దంపతులను స్వస్తి వచనాలతో ఆశీర్వదించారు. ఆశీర్వాదం తర్వాత స్వామి వారి ప్రసాదాన్ని గవర్నర్కు అందజేశారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని తాను దర్శించుకోవడం ఇదే ప్రథమమని, ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు.