Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈో పెద్దిరాజు పూలమాలు వేసి అర్చక వేదపండితులచే తిలకధారతో స్వాగతం పలికారు.
అనంతరం స్వామి అమ్మవార్లకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపిక అందజేశారు. ఈకార్యక్రమంలో ఏఈవోలు హరిదాస్ ,మోహన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.