AP CM Jagan on Coal | రాష్ట్రంలో కరెంట్ కొరతను నివారించడానికి దేశంలో ఎక్కడ ఉన్నా బొగ్గు నిల్వల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై సమీక్షించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.
థర్మల్ పవర్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. అందుకు నిధుల కొరత లేదన్నారు. బొగ్గు కొనుగోలు కోసం సింగరేణితోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ల్లోని కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి వెంటనే ప్రారంభించాలని చెప్పారు.