అమరావతి: తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ కురువృద్దుడు ఎం సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్ ) మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు, అభిమానులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెస్సార్ ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.