అమరావతి : రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తున్న చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సహకాలు, పారిశ్రామకి వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులపై నిర్వహించిన సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెద్ద ఉత్తున ఉపాధిని కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టని విధంగా ఏపీ ప్రభుత్వం ఎంఎస్ఎఈలకు ప్రోత్సాహకాలు ఇచ్చిందని గుర్తు చేశారు. క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు.
పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను బలోపేతం చేయాలని వెల్లడించారు. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు.