అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. జన్పథ్లోని ప్రధాని నివాసానికి వెళ్లిన సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య పలు కీలక ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ కానున్నారు. ఉదయం 11. 30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలు దేరిన సీఎం గన్నవరం వరకు రోడ్డు మార్గాన అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మధ్యాహ్నం 1.45 ఢిల్లీకి చేరుకున్న ఆయన ప్రధానితో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యలను, ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం . కాగా త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మోదీ జగన్తో చర్చించినట్లు సమాచారం. జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.