అమరావతి : దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బుధవారం ట్విట్ ద్వారా నివాళి అర్పించారు. యువజన దినోత్సవం సందర్భంగా యువతకు శుభకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానంద ‘అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది అని ప్రశంసించారు.