అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంటి ముంగిట అందమైన రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఏర్పాటుచేశారు. భోగి మంటలతో ప్రారంభమైన వేడుకలను మూడు రోజుల పాటు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దంపతులు శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో గోశాల వద్ద ఏర్పాటుచేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
సంప్రదాయ పంచెకట్టు ధరించిన జగన్ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలను, గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు