అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విరుచుకు పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు, పవన్ నాటకాలు ఆడడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.
ఇటీవల తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు కనీసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఇద్దరు నాయకులు కూడా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన వారేనని విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ధి చేసుకోలేకపోయారని , సొంత నియోజకవర్గాన్ని విస్మరించిన చంద్రబాబు ఉత్తరాంధ్రను ఎందుకు పట్టించుకుంటాడని అన్నారు.