అమరావతి : ఈనెల 29న ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశమవుతుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. సెప్టెంబర్లో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలపై కూడా చర్చించే అవకాశముంది. ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.
జూన్ 24 న చివరిసారిగా జరిగిన భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మఒడి పథకానికి, రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.