అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ ఏపీ క్యాబినేట్ తీర్మానించింది. ఈరోజు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అధికార భాష చట్టం 1966 సవరణ చేస్తూ ఉర్దూను రెండో భాషకు ఆమోదం తెలిపింది. విదేశీ మద్యం నియంత్రణ చట్టానికి సవరణ చేసింది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
అదేవిధంగా ధార్మిక సంస్థల చట్ట సవరణకు, టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం, రూ.8,741 కోట్ల రుణ సమీకరణ, ఏపీ మారిటైం బోర్టుకు హామీ ఉండేందుకు మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి రుణ సమీకరణ చేయాడానికి ఆమోదం తెలిపింది. ఖాయిలాపడిన చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణకు , మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్ల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.