అమరావతి : ఏపీలో అధికార వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు పార్టీలో చేరారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA ) బీజేపీ గూటికి చేరుకున్నారు. తిరుపతి జిల్లా గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ (Varaprasad) ఢిల్లీలో ఆదివారం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే సమక్షంలో బీజేపీ(BJP) లో చేరారు.
2019లో గూడురు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ వరప్రసాద్కు మరోసారి టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో మేరిగ మురళీధర్కు అవకాశం కల్పించడంతో మనస్తాపానికి గురై బీజేపీలో చేరారు. 2014లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.