అమరావతి : ఏపీలోని హిందూపురం వైసీపీ( YCP) నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (Mohammed Iqbal ) పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా( Resign ) సమర్పించినట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్ (CM Jagan) కు, మండలి చైర్మన్కు రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పదవి కాలం 2027 వరకు ఉన్నప్పటికీ పదవికి, పార్టీకి రాజీనామా చేయడం వైసీపీలో కలకలం సృష్టిస్తుంది.
2019లో జరిగిన ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్ హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ (Balakrishna) పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఇటీవల నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను తప్పించి దీపక అనే మహిళకు అప్పగించడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం.