అమరావతి : ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రముఖుల రాజీనామాలు, చేరికలతో రాజకీయ ముఖచిత్రం రోజురోజుకూ మారుతున్నాయి. తాజాగా మచిలిపట్నం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి(MP Balashauri) పార్టీకి రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మార్పులు, చేర్పుల కారణంగా టికెట్ రాని ఆశావాహులు నిరాశతో వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశానని, తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.