అమరావతి : ఏపీలోని పలు పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కార్మికులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కాకినాడలోని వాకలపూడిలోని ప్యారీ షుగర్స్లో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. ఈనెల 19 న ఇదే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన మరవక ముందే ఇవాళ మరోసారి ప్రమాదం జరిగింది .
ఈ పరిశ్రమంలో మరోసారి బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతి చెందిన వారిలో రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉన్నారు . తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు.