అమరావతి : ఆంధ్రప్రదేశ్కు మరో లక్షా 80 వేల కోవిషీల్డ్ టీకాలు అందాయి. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు లక్ష డోసులు.. హైదరాబాద్ నుంచి మరో 80 వేల టీకా డోసులు చేరాయి. వీటిని గన్నవరంలోని రాష్ట్ర టీకాల నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పంపిణీ నిమిత్తం వీటిని జిల్లాలకు తరలించనున్నారు. ఈ లక్షా 80 వేల టీకా డోసులతో రాష్ట్రంలో టీకా పంపిణీలో పురోగతి రానుంది. ఆంధ్రప్రదేశ్కు అదనపు టీకా డోసులు కేటాయించాలని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.