దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.
కరోనా నియంత్రణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు జరిమానా వేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. కొవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ త్రిపాఠికి శుక్రవారం పోలీసులు జరిమానా విధించారు.
కారులో మాస్క్ ధరించకుండా వెళ్తున్న రాహుల్ను గుర్తించిన పోలీసులు రూ.500 ఫైన్ వేశారు.
లాక్డౌన్ సమయంలో ఎలాంటి కారణం లేకుండానే తిరుగుతున్నట్లు గుర్తించారు. కారులో మరికొంత మంది ఉన్నారని కొంద్వా పోలీస్ ఇన్స్పెక్టర్ సర్దార్ పాటిల్ చెప్పారు. ఈ ఘటన పుణెలోని కొంద్వా ప్రాంతంలో జరిగింది.