Ambati Rambabu | ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. రా కదలిరా అంటే వచ్చే వారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.
‘అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు, లోకేష్తో పాటు ఆయనకూ ప్రజాదరణ ఏమాత్రం లేదు’ అని అంబటి అన్నారు. ఏపీలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోకేష్, పవన్తో హైదరాబాద్కు పోవాల్సిందేనని అన్నారు. అధికారికంగా, అనధికారికంగా పొత్తులు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్కు అలవాటేనని అన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని అంబటి మండిపడ్డారు.
ఇచ్చినమాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదే అని, ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరంటూ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే కుప్పంలో ఎయిర్పోర్టు కడతానంటున్న చంద్రబాబు.. ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదని అంబటి సూటిగా ప్రశ్నించారు.