అమరావతి : నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి(DRO), కలెక్టర్ ఆధ్వర్వంలో ఓట్ల లక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం లేదని ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డి (Minister Kakani ) అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పనిచేశారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
జూన్ 4న కౌంటింగ్ (Counting) నిర్వహణకు ఒక అబ్జర్వర్ను నియమించాలని ఆయన కోరారు. పోలీస్ అధికారులను ఉద్దేశ్యపూరితంగా బదిలీ చేసిందని , కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్(Police) అధికారులుఉద్రిక్తతలను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. వైసీపీ(YCP) బలంగా ఉన్న ప్రాంతాల్లో భయబ్రాంతులకు గురిచేశారని తెలిపారు. మాచర్ల (Macharla) ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని ఆరోపించారు.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకు డబ్బులు పంచితే , దానిమీద ఫిర్యాదు చేస్తే ఆర్వో పట్టించుకోలేదని అన్నారు. మానవతా దృకధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.