అమరావతి : చిత్తూరు జిల్లాలో కరెంట్ షాక్తో ఏనుగు మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలో పంట పొలాల వద్ద ఏనుగు తొండంతో బోరు మీటర్ను లాగడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగు కళేబరాన్ని ఖననం చేయనున్నారు.
ఇటీవల జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులు రోడ్లపైకి వస్తుండడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు జనసంచారం ఉన్న గ్రామాలకు వస్తున్నాయి. తమకు ప్రమాదం జరుగకుండా ఏనుగులపై ప్రత్యేక నిఘా ఉంచి అటవీ ప్రాంతంలోకి తిరిగి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.