బాపట్ల జిల్లా : ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఏడో రోజుకు చేరుకున్నది. ప్రస్తుతం మహా పాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతున్నది. బాపట్ల జిల్లాలో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ నెల 12వ తేదీన మహా పాదయాత్ర ప్రారంభమైంది.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఏడో రోజులుగా కొనసాగుతున్నది. నగరం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమై పలు గ్రామాల మీదుగా కొనసాగుతున్నది. ఉదయాన్నే పాదయాత్ర ప్రారంభానికి ముందుగా పరిసర గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి పాదయాత్రలో పాల్గొన్న రైతులు, మహిళలను సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్తుండటంతో ఈ పాదయాత్ర వద్దకు ప్రజలు ముఖ్యంగా యువత పెద్దఎత్తున చేరుకుని సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏండ్లు పూర్తవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజధాని గ్రామాల రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు. వీరి పాదయాత్ర దాదాపు 60 రోజుల పాటు కొనసాగనున్నది. అమరావతి నుంచి అరసవిల్లి వరకు సాగనున్న ఈ పాద్రయాత్రను దాదాపు 90 కిలీమీటర్ల మేర నిర్వహించనున్నారు. పాత గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లాకు ఈ యాత్ర చేరుకోనున్నది.