తిరుమల : వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందు కు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి చెంతకు చేరుకుంటున్నారు. శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయాయి. వెలుపల కూడా భక్తులు దర్శనానికి బారులు తీరారు. దర్శనానికి 25 గంటల సమయం పడుతుంది.
నిన్న శుక్రవారం 67,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 39,837 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.70 వచ్చిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.