తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ , పీజీ కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి యాజమాన్య కోటాలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు, టీటీడీ ఉద్యోగుల పిల్లలు, బాలమందిరంలో చదువుకున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని వెల్లడించారు. రేపు (19న) ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పొందే ప్రవేశాలు న్యాయస్థానం ఉత్తర్వులకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తామని, అయితే యాజమాన్య కోటా కింద ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వసతి కల్పించబడదని స్పష్టం చేశారు.