అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ సురేంద్రను ఒక రౌడీ షీటర్ వెంటాడి వేటాడి నడిరోడ్డుపై హత్య చేసిన ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక సీఐని సస్పెన్షన్ చేయగా మరో సీఐతోపాటు, ఏఎస్సైను వీఆర్కు పంపారు.
విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడంటూ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ ఆదినారాయణ రెడ్డి, ఎఎస్సై కృష్ణారెడ్డిలను వీఆర్కు పంపారు. రెండో పట్టణ సీఐ రమణను సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదంటూ విపక్షాల విమర్శలకు తలొగ్గిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.