అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఇవాళ పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో వాయిదా వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షించి వాయిదాతో నిరాశకు గురయ్యారని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టు హాజరును వాయిదా వేసినట్లుగానే విద్యార్థుల ఫలితాలను కూడా వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
విద్యారంగంపై అవగాహన లేని బొత్స సత్య నారాయణకు విద్యాశాఖ మంత్రి అప్పగించడంతో విద్యావ్యవస్థలో అనేక తప్పిదాలు చోటు చేసుకుంటు న్నాయని విమర్శించారు. బొత్సకు మద్యం షాపులు అనేకం ఉన్నాయని ఆయనకు మద్యం శాఖ అప్పగించి తే సబబుగా ఉండేదని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో అసమర్ధత పాలన కొనసాగుతుందని వైసీపీ పాలనపై మండిపడ్డారు.