అమరావతి : ఏపీలోని కృష్ణపట్నం పోర్టు (Krishnapatnam Port) లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్ వచ్చింది. లోడింగ్ పూర్తయిన తరువాత క్యాజువల్ ఉద్యోగులు నౌకలోని ట్యాంకర్ను శుభ్రం చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయ్యింది. ఈ దుర్ఘటనలో క్యాజువల్ ఉద్యోగులు ఖదీర్, ప్రశాంత్ మృతి చెందగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.