కర్నూలు : నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గంలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగింది. చలమ రేంజ్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నంద్యాల వైపు వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడం వల్లే పెద్దపులి చనిపోయినట్లు తెలుస్తోంది. పులి కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.