అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ ముందున్న కార్మికుల వ్యాన్ను ఢీకొట్టడం దాని ముందున్న ద్విచక్రవాహనం, కారును ఢీ కొనడంతో నలుగురు మృతి (Four Dead) చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు (Chitoor) జిల్లా నగరి మండలం ధర్మపురం వద్ద రహదారి (Highway)పై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి నగరికి వెళ్తున్న లారీ ( Lorry ) ధర్మపురం వద్ద రహదారి డివైడర్లకు కలర్వేస్తున్న కార్మికుల వ్యాన్ను ఢీకొట్టింది. ఈ వ్యాన్ ముందుకెళ్లి ద్విచక్రవాహనాన్ని, కారును ఢీ కొనడంతో నలుగురు చనిపోగా మరో నలుగురు తిరుపతి, నగరి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.