తిరుమల : ఇటీవల వర్షాలకు ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలను కేరళ నిపుణుల బృందం సభ్యులు ఆదివారం పరిశీలించారు. టీటీడీ ఆహ్వానం మేరకు కేరళ రాష్ట్రంలోని కొల్లం అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద అంతర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న నిపుణుల బృందం సభ్యులు రెండో ఘాట్రోడ్డును పరిశీలించారు.
కొండచరియలు విరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్రా పరిజ్ఞానం ఉపయోగించుకొని సమగ్ర సర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు. ఈ కార్యక్రమంలో నిపుణులు ప్రొఫెసర్ మనీషా, ప్రొఫెసర్ నిర్మలావాసుదేవన్, ప్రొఫెసర్ సుదేష్ విద్వాన్ , టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసులు రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, ఎఫ్ఆర్ఓ వెంకటసుబ్బయ్య తదితరులు ఉన్నారు.